Wednesday, April 24, 2024

మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఘ‌న నివాళి

గంపలగూడెం, భారతరత్న, ప్రఖ్యాత ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య వర్ధంతి సందర్భంగా పెనుగొలను మండల పరిషత్ మెయిన్ ప్రాథమిక పాఠశాలలో షిరిడి సాయి బాబా సేవాకమిటీ ఆధ్వర్యంలో నివాళి కార్య‌క్ర‌మం సోమవారం నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఒకటి నుంచి ఐదో తరగతి చదువుచున్న విద్యార్థులకు తెలుగు,ఇంగ్లీష్ దస్తూరి పోటీలు నిర్వహించి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో షిరిడి సాయి బాబా సేవా కమిటీ కన్వీనర్ చుండూరు గంగాధర శర్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెరుకూరి మధుసూదన్ రావు, ఉపాధ్యాయులు చావా రమ, శీలం లక్ష్మారెడ్డి,యస్ .లీలాశంకర్, షిరిడి సాయి బాబా సేవా కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement