Thursday, April 25, 2024

పోలింగ్ సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే రక్షణ నిధి

ఎ. కొండూరు – మండలంలో జరుగుతున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను గురువారం తిరువూరు నియోజవర్గ ఎమ్మెల్యే కొక్కిలగడ్డరక్షణనిధి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన చీమలపాడు లో ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లు కూడా ఉదయం నుండే ఎంతో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాటానికి ఎండను కూడా సైతం లెక్క చేయకుండా బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. తిరువూరు నియోజకవర్గం లోని, తిరువూరు, గంపలగూడెం, విసన్నపేట మండలాల్లో కూడా పర్యటించి పోలింగ్ సరళిని పరిశీలించినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు, వైసిపి ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేశారని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని అన్ని స్థానాలను వైసిపి అభ్యర్థులే కైవసం చేసుకుంటారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అభ్యర్థి భూక్యా గనియా, వైసిపి రాష్ట్ర నాయకులు నరెడ్ల వీరారెడ్డి, మాజీ జెడ్పిటిసి పాలం ఆంజనేయులు, తుమ్మూరు వెంకటేశ్వర రెడ్డి, పర్వతనేని చంద్రమోహన్, ఎంపీపీ అభ్యర్థి కాలసాని నాగలక్ష్మి, కాలసాని చెన్నారావు, దాసరి సతీష్, ఎంపీటీసీ అభ్యర్థి కోలా నాగమణి, సర్పంచ్ మోర్ల లక్ష్మి, సాంబశివరావు, కోలా నరసింహారావు, వార్డు సభ్యురాలు మేకల కుమారి, చీపు సత్యనారాయణ, వడ్డీ కాసులు, గుర్రాల వెంకట్రావు, బెజవాడ నాగ కృష్ణ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement