Saturday, April 20, 2024

భారత అమూల్యరత్న బాబు జగ్జీవన్ రామ్ ..- ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు

నందిగామ – భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్లో ఆయన విగ్రహానికి ,పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని పేదవర్గాలు, శ్రామిక, వెనుకబడినవర్గాలు, ముఖ్యంగా షెడ్య్డూుల్ కులాలు, షెడ్య్డూుల్ తెగ వారి హక్కుల కోసం వారి అభివృద్ధి కోసం జగ్జీవన్‌రామ్‌ తీవ్రంగా కృషి చేశారన్నారు ,అదేవిధంగా ముప్పైమూడేళ్ళకు పైగా కేంద్ర కేబినెట్‌మంత్రిగా, దేశ ఉప ప్రధానమంత్రిగానూ డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ తీసుకున్న అసంఖ్యాక నిర్ణయాలు, ఆయన నాయకత్వాన చేసిన అనేక ముఖ్యమైన -మౌలికమైన చట్టాలు దేశ సామాజిక పరివర్తనలో, అమలు జరిగిన సామాజిక న్యాయంలో ప్రస్ఫుటంగా ప్రతిఫలిస్తున్నాయని తెలిపారు. సామాజిక, రాజకీయ బానిసత్వంపై జీవితాంతం యుద్ధం చేసిన బాబు జగ్జీవన్ రామ్ ఎప్పటికీ స్ఫూర్తిప్రధాత అని, ఆదర్శనీయుడని ఆయన చూపిన బాటలో నేటి తరం నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement