Thursday, April 25, 2024

ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఇంట్లో విషాదం

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వెల్లంపల్లి సూర్యనారాయణ (80) అనారోగ్యంతో గురువారం ఉ.8:15 గంటలకు కన్నుమూశారు. సూర్యనారాయణ భౌతికకాయాన్ని సందర్శనార్థం మంత్రి నివాసం వద్ద ఉంచారు. విజయవాడ భవానీపురం పున్నమిఘాట్ వద్ద హిందూ శ్మ‌శ‌న‌వాటికలో గురువారం సాయంత్రం అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. కాగా మంత్రి వెల్లంపల్లికి పలువురు వైసీపీ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

దేవాదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు తండ్రి వెలంప‌ల్లి సూర్య‌నారాయ‌ణ‌(80) ఆకస్మిక మృతి పట్ల పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తన సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి సహా ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి గౌతమ్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తండ్రి లేని లోటు తీర్చలేనిదని , మంత్రి వెలంపల్లి తన పితృ వియోగాన్ని తట్టుకునే ధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని వేడుకుంటున్నట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement