Friday, April 26, 2024

వివాహేతర సంబంధం కలిగిన యువకుడిని పోలీసులకు అప్పగింత

ఇబ్రహీంపట్నం : భర్తను వదిలేసి ఒంటరిగా ఉంటున్న మహిళతో వివాహేతర సంబంధం కలిగిన యువకుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కొండపల్లి పుట్టలమ్మ గట్టు ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం పుట్టలమ్మ గట్టు ప్రాంతంలో నివసిస్తున్న వివాహిత (28)కు ఆరేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడ‌డంతో భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. ఆమెకు అదే ప్రాంతానికి చెందిన నాగేంద్ర (22) అనే యువకుడితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య సంబంధం కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలోనే సోమవారం అర్ధరాత్రి వివాహిత ఇంటిలోకి నాగేంద్ర ప్రవేశించాడు. మంగళవారం తెల్లవారుజామున వివాహిత సోదరులు, స్థానికులు గుర్తించి ఇంటి తలుపునకు బయట గడియపెట్టి తాళం వేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తాళం తీయించి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో సచివాలయ వాలంటీర్ గా పనిచేసిన నాగేంద్ర ఏడాది క్రితం మానేసినట్లు సమాచారం. ఇతనిపై ఇదేవిధమైన కేసు పోలీస్ స్టేషన్ లో నమోదైనట్లు స్థానికులు చెబుతున్నారు. మహిళతో వివాహేతర సంబంధం కలిగిన నాగేంద్ర ఆమెను వివాహం చేసుకోవాలని వారు పట్టుబట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement