Wednesday, April 24, 2024

పెన‌మ‌లూరులో ప్ర‌భుత్వ ఉద్యోగి ఆత్మ‌హ‌త్య‌

కృష్ణా : ఇంట్లో బెల్ట్ తో ఉరివేసుకుని ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్ప‌డిన ఘ‌ట‌న కృష్ణా జిల్లా పెనమలూరు పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. విజయవాడ ఆడిటర్ జనరల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసరుగా అగిరసబాబు పని చేస్తున్నాడు. ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ.. త‌న ఇంట్లో బెల్ట్ తో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు చేసుకున్నాడు. విగతజీవిగా ప‌డిఉన్న భ‌ర్త‌ను చూసిన భార్య అనూష పోలీసులకు సమాచారం అందించారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement