Wednesday, March 27, 2024

నర్సరీలో అగ్నిప్రమాదం

గంపలగూడెం, :మండలంలోని ఊటుకూరు శ్రీ మణికంఠ నర్సరీలో శనివారం ఉదయం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది.నర్సరీకి ఉపయోగించే ప్లాస్టిక్ ట్రేలు అగ్నికి అహుతి అయి పూర్తిగా కాలిపోయాయి దట్టమైన పొగలు వ్యాప్తి చెందడంతో గ్రామస్తులు తిరువూరు అగ్నిమాపక సిబ్బంది కి తెలియజేసారు వారు వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపుచేశారు,మంటలు అదుపులోకి రాకపోతే అక్కడే నూతనంగా తీసుకు వచ్చిన ట్రేలు,పరదా పట్టాలు కూడ తగలబడి ఉండేవని నిర్వాహకులు తెలిపారు. ఈ నర్సరీ బసవాపురం గ్రామానికి చెందిన సూరంపల్లి లక్ష్మీనారాయణకు చెందినదని అగ్ని ప్రమాదంలో సుమారు 2.50 లక్షల రూపాయలు మేర నష్టం ఉంటుందని నర్సరీ నిర్వాహకులు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement