Thursday, April 25, 2024

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి…

కారు గోడ‌ను ఢీకొట్టి ఇద్ద‌రు మృతి చెందిన ఘ‌ట‌న కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో చోటుచేసుకుంది. చ‌ల్ల‌ప‌ల్లి ద‌గ్గ‌ర అతివేగంగా వ‌చ్చిన కారు అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెంద‌గా.. మ‌రో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. అనంత‌రం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ మేర‌కు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement