Thursday, April 18, 2024

వారం వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కరోనాకు బలి

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కానుమోలు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వారం వ్యవధిలో కరోనా వైరస్‌కు బలయ్యారు. వారం రోజుల వ్యవధిలో కొలపల్లి సుబ్బారావు(62), భార్య సుబ్రహ్మణేశ్వరి(56), కుమారుడు నవీన్ కుమార్ (39) కరోనా కారణంగా మృతి చెందడం వారి కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. సుబ్బారావు మరొక కుమారుడు న్యూజిల్యాండ్‌లో ఉన్నాడు. సుబ్బారావు మనుమడు ఎనిమిదేళ్ల వయసులో తండ్రికి, తాత, నాయనమ్మకు తలకొరివి పెట్టడం కానుమోలు గ్రామంలో ప్రజల హృదయాలను కలిచివేసింది. కాగా నవీన్ కుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుబ్బారావు బాపులపాడు ఎంపీడీవో కార్యాలయంలో, రామన్నగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో అటెండర్‌గా చేసి రిటైరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement