Tuesday, March 26, 2024

కృష్ణా నదిలో గల్లంతైన విద్యార్థుల మృత‌దేహాలు ల‌భ్యం..

సరదాగా నదిలో ఈతకు ఏడుగురు విద్యార్థులు వెళ్లారు. ఇందులో ఐదుగురు కృష్ణా నదిలో దిగి గల్లంత‌య్యారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. పటమటకు చెందిన ఏడుగురు చిన్నారులు నిన్న సాయంత్రం కృష్ణానదిలో ఈతకు వెళ్ల‌గా.. చిన్నారులు స్నానం చేస్తుండగా ప్రవాహానికి ఒక్కొక్కరు కొట్టుకుపోయారు. ఒకరు క్షేమంగా ఒడ్డుకుచేరగా.. మ‌రొక‌రిని స్థానిక జాలరులు రక్షించారు. మిగ‌తా ఐదుగురు నీటి ప్ర‌వాహంలో కొట్టుకుపోయారు. గ‌ల్లంతైన వారికోసం పోలీసులు జాలర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న రాత్రి కామేశ్‌, గుణశేఖర్‌ మృతదేహాలు లభ్యం కాగా చీకటిపడడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. అధికారులు శనివారం ఉదయం గాలింపు చర్యలను తిరిగి ప్రారంభించారు. కొద్దిసేపటి అనంతరం బాలు, బాజి, హుస్సేన్‌ మృతదేహాలు లభ్యం కావడంతో వీటిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement