Thursday, April 18, 2024

ఎమ్మెల్సీ కరీమున్నిసా హఠాన్మరణం పట్ల సీఎం జ‌గ‌న్ విచారం

ఎమ్మెల్సీ యండి.కరిమున్నిసా భౌతిక కాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేను నిర్వహించిన ముఖ్యమంత్రి నేరుగా విజయవాడ, సింగ్ నగర్ ఫ్లై ఓవర్ సమీపంలోని ఎమ్మెల్సీ కరీమున్నిసా నివాసానికి చేరుకున్నారు. కరీమున్నిసా భౌతికకాయనికి పూల మాలవేసి సీఎం నివాళులర్పించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా హఠాన్మరణం పట్ల జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిన్న ఉదయం శాసన మండలి సమావేశాలకు హాజరైన ఆమె రాత్రి అస్వస్థతకు గురికావడం, గుండె పోటుతో మరణించడం దురదృష్టకరమన్నారు.

విజయవాడలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ప్రతిభావంతమైన నాయకురాలిగా, కార్పొరేటర్ నుంచి మండలి సభ్యురాలిగా ఎదిగిన కరీమున్నీసా మరణం చాలా బాధ కలిగించిందన్నారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ముఖ్యమంత్రి వెంట ఉపముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెలంపల్లి శ్రీనివాసరావు, యంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే లు మల్లాది విష్ణు, యం.జగన్మోహన్ రావు, జిల్లా కలెక్టర్ జె.నివాస్, సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్, వైఎస్ ఆర్ సీపీ నాయకులు దేవినేని ఆవినాష్, తదితరులున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement