Friday, April 19, 2024

అవ‌నిగ‌డ్డ‌లో వ్య‌క్తి దారుణ హ‌త్య‌..

కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అవనిగడ్డలో కోడిపందేలు ఆడి తిరిగి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని హత్య చేశారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం అర్ధరాత్రి సీతాయిలంకకు చెందిన మేడికొండ అనిల్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ‌డంతో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. దీంతో అత‌డిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. క‌క్ష‌పూరితంగా ఈ హ‌త్య జ‌రిగిన‌ట్లు అనుమానిస్తున్నారు. అవనిగడ్డలో నివాసం ఉంటున్న గుంటూరు జిల్లా గొరికపర్రుకు చెందిన వ్యక్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement