Friday, March 29, 2024

Breaking: అవనిగడ్డలో భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటం

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డలో భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటం చేస్తుంది. 2020 నవంబర్ 5న‌ వైష్ణవి అనే మహిళను మణికంఠ ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయిన నాటి నుంచి వైష్ణవిని భర్త మణికంఠ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోబోయిన వైష్ణవిని బంధువులు రక్షించి ఇంటికి తీసుకు వచ్చారు. ఇద్దరు కవల పిల్లలు పుట్టాక భార్య వైష్ణవిని భ‌ర్త మ‌ణికంఠ‌ వదిలి వెళ్లిపోయాడు. తన ఇద్దరు పిల్లలతో భర్త ఇంటికి వెళ్ళిన వైష్ణవిని మణికంఠ కుటుంబీకులు ఇంటి నుంచి బయటకు తోసేశారు. తనకు న్యాయం చేయాలంటూ తన ఇద్దరు పిల్లలతో భర్త ఇంటి ముందు కూర్చుని వైష్ణవి నిరసన తెలుపుతుంది. పోలీసులు వైష్ణవి వద్దకు చేరుకుని వివరాలు తెలుసుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement