Wednesday, April 24, 2024

BREAKING : కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా.. ప‌లువురికి గాయాలు

బంటుమిల్లి మండలం పాచ్ఛాపురం వద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. బొలెరో వాహ‌నం బోల్తా ప‌డ‌డంతో 12మంది ప్ర‌యాణికులు గాయ‌ప‌డ్డారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. వెస్ట్ గోదావరి జిల్లా వీరవాసం మండలం వడ్డీ గూడెంకు చెందిన కూలీలు బొలెరో వాహనంలో కూలీ ప‌నుల నిమిత్తం వెళ్లారు. ఈ క్ర‌మంలో బంటుమిల్లి మండలం పాచ్ఛాపురం వద్దకు రాగానే వాహనం బోల్తా పడింది. ఈ ప్ర‌మాదంలో 12 మందికి గాయాలయ్యాయి. వెంట‌నే వారికి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వీరు కడప జిల్లా ప్రొద్దుటూరులో కూలి పనిచేయడానికి వెళ్లి తిరిగి వస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement