Thursday, April 18, 2024

ఇంద్రకీలాద్రిలో ఫిట్స్ వ‌చ్చి కుప్పకూలిన భక్తుడు.. ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా..!

ఇంద్రకీలాద్రిపై ఓ భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు ఫిట్స్ వచ్చి పడిపోయాడు. సుమారు 45 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి రూ.500 టిక్ తీసుకుని క్యూ లైన్ మార్గంలో దర్శనానికి వచ్చారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో దుర్గమ్మ దర్శనానికి క్యూలైన్ మార్గంలో వేచి ఉండగా ఫిట్స్ వచ్చి పడిపోయాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వెంటనే అతనికి సపర్యలు చేశారు. ఆపై ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో భక్తుడు చనిపోయాడు. భక్తుడు హైదరాబాద్‌‌కు చెందిన మూర్తిగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement