Friday, March 29, 2024

కోనసీమ విధ్వంసం ఊహించలేదు : ఏపీ హోంమంత్రి

కోనసీమ విధ్వంసం ఊహించలేదని ఏపీ హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ… ఈ కుట్రకు బాధ్యులెవరో గుర్తిస్తున్నామన్నారు. ధర్నాలు, నిరాహారదీక్షలు చేసింది ఎవరో అందరికీ తెలుసు అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టకపోతే జనసేన నాయకుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది వాస్తవం కాదా అన్నారు. రాళ్ల దాడులు ఎదుర్కొన్నా పోలీసులు సంయమనం పాటించారన్నారు. పోలీసులను అభినందించకుండా చంద్రబాబు, పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 70మందికి గుర్తించామని, 40మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement