Thursday, April 25, 2024

విశాఖ‌లో ప‌ర్య‌టించ‌నున్న కిష‌న్ రెడ్డి.. ఎయిర్ పోర్ట్ వ‌ద్ద భారీ బందోబ‌స్తు

విశాఖ ఎయిర్ పోర్ట్ వ‌ద్ద పోలీసులు భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేశారు. కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి నేడు విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు హైఅల‌ర్ట్ ని ప్ర‌క‌టించారు. విశాఖలోని సింహాద్రి ఎన్టీపీసీని ఆయన సందర్శించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నిరసనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. జీవీఎంసీ చౌక్ వద్ద స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటితో 600వ రోజుకు చేరుకున్నాయి.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర నిర్ణయించినప్పటి నుంచి దీక్షలు కొనసాగుతున్నాయి.ఈ సందర్భంగా వారు ఈ రోజు బహిరంగసభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు పలు పార్టీలు, సంఘాల నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో కిషన్ రెడ్డికి నిరసనలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. నేషనల్ హైవేపై ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతే ముందుకు అనుమతిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement