Friday, April 19, 2024

Killing: అనంత‌పురంలో అమానుషం.. త‌న పోలిక‌ల‌తో పుట్ట‌లేద‌ని..

Anantapuram: త‌న పోలిక‌ల‌తో పుట్ట‌లేద‌ని కూతురిని చంపి చెరువులో ప‌డేశాడో తండ్రి. ఈ అమానుష ఘ‌ట‌న అనంత‌పురం జిల్లా క‌ల్యాణ‌దుర్గంలో జ‌రిగింది. మ‌ల్లికార్జున అనే వ్య‌క్తి ఈ దురాఘ‌తానికి పాల్ప‌డ్డాడు. రెండు నెల‌ల క్రిత‌మే అత‌నికి పాప పుట్టింది. అయితే, భార్య‌పై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్న‌ మ‌ల్లికార్జున.. ఆ పాప త‌న పోలికల‌తో ఎందుకు పుట్ట‌లేద‌ని ఘ‌ర్ష‌ణ ప‌డేవాడు. ఆ క్ర‌మంలో నిన్న‌ పాప‌ను తీసుకుని ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లాడు. అత‌డు తిరిగి ఇంటికి రాక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి నిన్న‌టి నుంచి తండ్రి, పాప‌కోసం వెతుకుతున్నారు.

ఈ రోజు ఆ పాప స్థానిక చెరువులో విగ‌త‌జీవిగా క‌న‌ప‌డింది. మ‌రోవైపు, ఆ పాప తండ్రి మ‌ల్లికార్జున బెంగ‌ళూరు పారిపోయాడు. అయితే, అత‌డు అక్క‌డి నుంచి స్వ‌యంగా పోలీసుల‌కు ఫోను చేసి తానే పాప‌ను చంపాన‌ని చెప్పిన‌ట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement