Tuesday, April 23, 2024

జాతీయ స్థాయిలో రాజ‌కీయ పార్టీని ప్రారంభించే అర్హ‌త కేసీఆర్‌కు లేదు : సోము వీర్రాజు

జాతీయ స్థాయిలో రాజ‌కీయ పార్టీని ప్రారంభించే అర్హ‌త కేసీఆర్ కు లేద‌ని బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు అన్నారు. తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌ను జాతీయ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశ‌పెడుతూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. టీఆర్ఎస్ పేరును భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్‌)గా మారుస్తూ కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఆంధ్రుల‌ను ద్రోహులుగా అభివ‌ర్ణించిన కేసీఆర్‌కు ఏపీలో అడుగుపెట్టే అర్హ‌త కూడా లేద‌ని వీర్రాజు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఓట‌మి ఖాయ‌మ‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. ఎన్నిక‌ల త‌ర్వాత బీఆర్ఎస్, వీఆర్ఎస్ తీసుకోక త‌ప్ప‌ద‌ని ఆయ‌న అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement