Friday, April 26, 2024

జ‌మున మృతి ప‌ట్ల.. కేసీఆర్, జ‌గ‌న్ సంతాపం

టాలీవుడ్ సీనియర్ నటి జమున (86) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్ లోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటించిన ఆమె.. పుట్టిల్లు సినిమాతో తెరంగేట్రం చేశారు. కొద్దిసేపట్లో జమున భౌతికకాయాన్ని ఫిల్మ్ చాంబరుకు తీసుకురానున్నారు. ఇక జమున మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌ సంతాపం తెలిపారు. తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్రమ‌ మొద‌టిత‌రం నటీమణుల్లో అగ్రక‌థానాయ‌కిగా వెలుగొంది తెలుగు వారి హృద‌యాల్లో చెర‌గని ముద్రవేసుకున్న జ‌మున మృతి చెంద‌డం బాధాక‌రమన్నారు. ఆవిడ‌ మృతి తెలుగు చిత్ర ప‌రిశ్రమ‌కు తీర‌ని లోటన్నారు. జ‌మున కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement