Tuesday, April 16, 2024

Breaking: అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య.. నంద్యాల జిల్లాలో ఘ‌ట‌న‌

నంద్యాల : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఓ కౌలురైతు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. బనగానపల్లె మండలం యాగంటిపల్లిలో సోమవారం ఈ దారుణం జ‌రిగింది. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వ‌చ్చింది. మండలంలోని యాగంటిపల్లికి చెందిన శంకర్ రెడ్డి (48) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఆయన తనకున్న సొంత భూమితోపాటు, సుమారు ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. అయితే, రెండేళ్లుగా పంట సాగు పై చేసిన అప్పులు రెట్టింపు అయ్యాయి. దీంతో చేసిన అప్పులు తీర్చలేక వడ్డీ భారం అధికమవడం, అప్పుల వారి వేధింపుల‌తో ఈ దారుణ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

దీంతో అవమానం తాళలేక శంకర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, కౌలు రైతు శంక‌ర్‌రెడ్డికి ఇద్దరు కుమార్తెలున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement