Wednesday, April 24, 2024

తుమ్మ‌ల‌గుంట కళ్యాణ వేంకటేశ్వర స్వామి.. వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం

తిరుపతిరూరల్ : తుమ్మలగుంట కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం వేకువజాము 4గంటలకు వైకుంఠ ద్వారాన్ని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు, చంద్రగిరి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసిన ప్రభుత్వ చీఫ్ విప్, కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి చెవిరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.

కళ్యాణ వెంకటేశ్వర స్వామిని శ్రీకాంత్ రెడ్డి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తుమ్మలగుంట ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చాలా చక్కగా తీర్చిదిద్దారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.. భక్తులు గొప్ప ఆధ్యాత్మిక వాతావరణంలో తరించవచ్చని సూచించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారని కొనియాడారు. అనంతరం శ్రీకాంత్ రెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement