Thursday, April 25, 2024

వివేకా హత్య కేసు: నిజాలు నిగ్గు తేల్చాలి.. జగన్ నోరు విప్పాలి

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోరు విప్పాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అందరి వేళ్ళు అవినాష్ రెడ్డి వైపు చూపుతున్నాయని అన్నారు. హత్య జరిగిన మరుక్షణం నుంచే సహజ మరణంగా చిత్రీకరించేందుకు యత్నించారని తెలిపారు. సీఎం దానిని విపరీతంగా రాజకీయంగా వాడుకున్నారని ఆరోపించారు. సునీతరెడ్డి తెగించి సహసోపేతంగా ముందుకు వచ్చి సీబీఐని ఆశ్రయించిందని, కేంద్రంలో అందరినీ కలిసిందని పేర్కొన్నారు.

విచారణలో అందరి వాంగ్మూలాలు.. అవినాష్ రెడ్డిపై చెప్పారని అని కాల్వ శ్రీనివాసులు అన్నారు. కేసులో ప్రధాన కుట్రదారు అవినాష్ రెడ్డి అని తెలుస్తోందన్నారు. దీనికి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును దోషిగా చూపే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా చేసిన ఆరోపణలపై ఎందుకు నిజాలు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తెలు కుట్టిన దొంగలా ఉన్నాడని విమర్శించారు. రూ.40 లక్షలు సూపరీ ఇచ్చి మాజీ మంత్రిని హత్య చేశారంటే దీని వెనుక ఎవరు ఉన్నారని నిలదీశారు. అవినాష్ రెడ్డిని ప్రశ్నించాలని, జగన్మోహన్ రెడ్డి ఇప్పటివకైనా నిజాలు మాట్లాడాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ తొందరగా పూర్తి చేసి దోషులను శిక్షించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement