Tuesday, March 26, 2024

స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వైఎస్ కల.. సీఎం జగన్

కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వైఎస్ కల అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ల పల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్లాంటుకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మొదటి దశలో ఒక మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందన్నారు. పూర్తి సామర్థ్యం మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి అన్నారు. రూ.8,800కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. 25వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున తక్కువ మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. స్టీల్ ప్లాంట్ తో ఈ ప్రాంత రూపురేఖలే మారిపోతాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement