Wednesday, March 27, 2024

పులివెందుల‌లో రోడ్డు ప్ర‌మాదం – ఇద్ద‌రు మ‌హిళా కూలీలు దుర్మ‌ర‌ణం..

కడప: పులివెందులలోని ముద్దనూరు సమీపంలో జ‌రిగిన‌ రోడ్డు ప్రమాదంలో ఇద్ద‌రు మ‌ర‌ణించ‌గా, మ‌రో ఆరుగురు గాయ‌ప‌డ్డారు… రోడ్డుపై ప్ర‌యాణిస్తున్న‌ జీపు, కారు, మున్సిపాలిటీ ట్రాక్టర్ ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా రైతు కూలీలు అక్కడికక్కడే చ‌నిపోయారు. క్షతగాత్రులను అక్కడున్న స్థానికులు పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు ఇ. కొత్తపల్లె గ్రామానికి చెందిన ఇద్దరు మహిళా కూలీలని, గాయాలైన వారు మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుల‌ని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement