Thursday, April 25, 2024

దైవదర్శనానికి వెళ్లి వస్తూ అనంత లోకాలకు.. ఇద్ద‌రు మృతి

సంబేపల్లి : కర్నూలు చిత్తూరు జాతీయ రహదారి లోని గుట్టపల్లి బస్టాప్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్ద‌రు మృతి చెందగా 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శంఖ శోభ( 55), శంక లవ కుమార్ (40 )అక్కడికక్కడే మృతి చెందారు .ప్రభాకర్, దీపక్, చందన, కీర్తన ,జాహ్నవి, శశి లకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా (టౌన్) సంతపేట, రామ్ నగర్ కాలనీ వాసులు ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది తమ సొంత వాహనంలో కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లారు. దేవుని దర్శించుకుని తిరిగి స్వస్థలానికి వెళుతుండగా సంబేపల్లి మండలం గుట్ట బస్టాప్ వద్ద ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కారు నజ్జు నజ్జు అయింది. గాయపడ్డ వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎస్ ఎం డి షరీఫ్ ఫ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement