Friday, April 26, 2024

ప్రొద్దుటూరులో రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు వేడుక‌లు..

ప్రొద్దుటూరు – మెగాపవర్ స్టార్ రాంచరణ్ పుట్టిన రోజు వారోత్సవ సంబరాల చివరి కార్యక్రమం శనివారం నిర్వహించారు. కేక్ క‌త్తిరించి అభిమానులు సంబ‌రాలు జ‌రుపుకున్నారు. ఈ కార్యక్రమానికి సుధా ధియేటర్ యజమాని శెట్టిపల్లె చంద్రశేఖర్ రెడ్డి , లీజ్ ఓనర్ కృష్ణారెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. మెగాపవర్ స్టార్ రాంచరణ్ తండ్రిని మించిన తనయుడు అని కీర్తించారు. మెగా అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించి సమాజంపట్ల బాధ్యతగలవారని అభినందించారు. ఈ కార్యక్రంలో ప్రొద్దుటూరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్రెండ్స్ యూనిట్ టౌన్ వైడ్ సభ్యులు సుధాకర్, విక్రమ్, రామారావు, మెడికాల్ శ్రీను,చంద్ర, జిలాన్, ఓబయ్య ,చెన్న రంగా, రవి కుమార్, శ్రావణ్, షరీఫ్, రాజు , మధు ,లక్ష్మీ నారాయణ, పాములేటి, విజయ్ హబ్, జూబర్, హిమామ్ సుబ్బారాయుడు, ఈ కార్యక్రమంలో లో మెగా అభిమానులు అందరూ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement