Thursday, April 25, 2024

కడప జిల్లాలో దారుణం.. 9 ఏళ్ల పసిపాపపై మైనర్ బాలుడు అత్యాచారం

కడప జిల్లా చక్రాయపేటలో దారుణం చోటుచేసుకుంది. 9 ఏళ్ల పసిపాపపై అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ చిన్న మేక పిల్ల చనిపోవడంతో ఆ మైనర్ బాలిక దాన్ని పడేయడానికి గ్రామ సమీపంలోని కంప చెట్ల వద్దకు వెళ్లగా అక్కడ కాపు కాసి ఉన్న మదమెక్కిన ఆ మృగం దారుణానికి ఒడిగట్టాడు. ఆ పసిపాప బట్టలు మొత్తం చింపి నోటికి గుడ్డ కట్టి దారుణానికి ఒడిగట్టడంతో నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ ఆ బాలిక ఉండిపోయింది.

అయితే పాప ఎంత సేపటికీ రాకపోవడంతో ఆ చిన్నారి మేనత్త వెళ్లి చూడగా..ఈ దారుణం వెలుగులోకి వచ్చిందని బాలిక తండ్రి ఆవేదనతో చెప్పాడు. బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధితురాలి తండ్రి న్యాయం చేయాలంటూ చక్రాయపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా డప జిల్లాలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటనలో బాధిత కుటుంబానికి రాష్ట్ర మహిళా కమిషన్ అండగా నిలిచింది. జిల్లా ఎస్పీతో మాట్లాడి కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. బాలిక తల్లిదండ్రులతో ఆమె మాట్లాడి ధైర్యం చెప్పారు. కాగా మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జెల లక్ష్మీ బాధిత బాలికను పరామర్శించారు.

ఈ వార్త కూడా చదవండి: జామకాయ గొంతులో ఇరుక్కుని 9 నెలల బాలుడు మృతి

Advertisement

తాజా వార్తలు

Advertisement