Friday, April 26, 2024

సీబీఐకి కడప వైసీపీ ఎంపీ లేఖ

కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సిబిఐ కార్యాలయంలో విచారణకు ఆయన హాజరుకానున్నారు. అయితే అవినీష్ రెడ్డి సీబీఐక లేఖ రాశారు. సీబీఐ విచారణకు హాజరవుతున్నానంటూ లేఖ రాశారు అవినాష్‌ రెడ్డి. ఈ కేసు విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నానని.. అలాగే ఆడియో, వీడియో రికార్డింగ్‌కు అనుమతించాలని కోరారు. విచారణ సమయంలో తనతో పాటు న్యాయవాది ఉండేందుకు అనుమతివ్వాలని వైఎస్‌ అవినాష్‌రెడ్డి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement