Friday, March 29, 2024

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకున్న జిల్లా అడిషనల్ జడ్జి

బ్రహ్మంగారి మఠం – పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి మఠం లోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని 6వ జిల్లా అడిషనల్ జడ్జి సాయి కళ్యాణ చక్రవర్తి కుటుంబ సమేతంగా బ్రహ్మంగారిని దర్శించుకున్నారు. వారితో పాటు లోక్ అదాలత్ డి.ఎల్.ఎస్. వెంకట రాజేష్ కుమార్, బద్వేల్ జడ్జి ప్రవీణ్ కుమార్ బ్రహ్మంగారి దర్శించుకున్నారు. వారికి మఠం మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఏడోతరం మఠాధిపతులు
శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి నివాసంలో వారిని కలిసి బ్రహ్మంగారి కాలజ్ఞాన సారాంశాలను అడిగి తెలుసుకున్నారు. వారికి మఠం మేనేజర్ బ్రహ్మం గారి జీవితచరిత్ర వివిధ రకాల గ్రంథాలను, స్వామి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ శ్రీనివాసులు, ఏఎస్ఐ మూర్తి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, మఠం సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement