Wednesday, March 27, 2024

ఇడుపులపాయలో తండ్రి వైఎస్ఆర్ కు సీఎం జగన్ నివాళి..

కడప : ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన‌నున్నారు. సీఎం జ‌గ‌న్ తన తండ్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపుల పాయలోని ఆయన సమాధి వద్ద తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు వై.ఎస్ షర్మిలతో పాటు పలువురు కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం పులివెందుల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై ఎం.పి వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వీ.విజయరామరాజు, పులివెందుల డెవ‌ల‌ప్మెంట్ అథారిటీ(పాడ) వోఎస్డి అనిల్ కుమార్ తో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అభివృద్ధి పనులు ఏ దశలో ఉన్నాయి, అవసరమైన నిధులు మంజూరు పై ముఖ్యంగా చ‌ర్చ కొన‌సాగుతోంది. అనంతరం ఇడుపులపాయలోనే రాత్రి బస చేస్తారు. శనివారం ఉదయం విజయవాడకు బయలుదేరి వెళుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement