Thursday, April 25, 2024

వివేకా హత్య కేసులో ఆయుధాలు స్వాధీనం చేసుకున్న సీబీఐ

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రహస్యంగా ఆయుధాల కోసం కొనసాగించిన సీబీఐ అధికారులు ఎట్టకేలకు వాటి జాడను కనుక్కున్నారు. పులివెందులలోని సునీల్ యాదవ్, తోండూరులోని ఎర్రగంగిరెడ్డి, ప్రొద్దుటూరులోని సుబ్బారెడ్డి, సింహాద్రిపురంలోని ఉమాశంకర్ ఇళ్ళల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఈ మేరకు ఢిల్లీ నుంచి కడపకు చేరుకున్న సీబీఐ అధికారుల బృందం కడప జిల్లాలోని 20మంది రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో కలిసి పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించింది. ఆయుధాలు ఎక్కడ పడవేశానో గుర్తులేదని సునీల్ యాదవ్ చెప్పడంతో.. తనదైన శైలిలో సీబీఐ అధికారుల బృందం విచారణ జరిపింది. దీంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఏకకాలంలో నలుగురి ఇళ్ళలో ఆయుధాల కోసం సోదాలు నిర్వహిస్తున్న సీబీఐ… వారిళ్లల్లోనే ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ కుమార్ యాదవ్‌తో సీబీఐ అధికారులు స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారు.

సునీల్ యాదవ్ ఇంట్లో సీబీఐ సీజ్ చేసిన వస్తువులు: ఫోన్ నంబర్లతో కూడిన డైరీ, సునీల్ యాదవ్ పేరుతో రూ.3 లక్షల అకౌంట్ పేచెక్, సునీల్ యాదవ్ బ్యాంక్ పాస్‌బుక్, డబ్బుల లావాదేవీలకు సంబంధించిన రసీదులు, వ్యవసాయ పనిముట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement