Thursday, March 28, 2024

Breaking: లారీని ఢీకొన్న టెంపో.. స్పాట్ లోనే ముగ్గురు మృతి

ఆగి ఉన్న లారీ ని టెంపో వాహ‌నం ఢీకొట్ట‌డంతో స్పాట్ లోనే ముగ్గురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా చాపాడు దగ్గర జ‌రిగింది. ఆగి ఉన్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు ప్రొద్దుటూరుకు చెందిన అనూష, ఓబులమ్మ, రామ లచ్చమ్మగా గుర్తించారు. మరో 8 మందికి తీవ్రగాయాలు కాగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. తిరుమలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement