Friday, April 19, 2024

రూ.40 లక్షల గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్

కడప : కడప జిల్లా దువ్వూరు మండలంలోని గుడిపాడు గ్రామ సమీపంలో గంజాయి, దొంగ నోట్లు చలామణి చేస్తున్న 5మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. బుధవారం కడప నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ… నిందితులపై గతంలో పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.40 లక్షల విలువ గల 30 కేజీల గంజాయి, 3 కార్లు, రూ.500ల 7 నకిలీ నోట్లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అడిషనల్ ఎస్పీ తుషార్ దుడి, మైదుకూరు డీఎస్పీ వంశీదర్ గౌడ్, మైదుకూరు రూరల్ సీఐ నరేంద్ర రెడ్డి, దువ్వూరు ఎస్సై రాఘవేంద్ర రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement