Thursday, March 28, 2024

Flash: సీనియర్ జర్నలిస్ట్ నరసింహారావు కన్నుమూత

సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సి.నరసింహారావు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు.  అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్థరాత్రి 1.50కి ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ రోజు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వ్యక్తిత్వ వికాసంపై సి.నరసింహారావు అనేక పుస్తకాలు రాశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సి. నరసింహారావు 1948, డిసెంబర్ 28న జన్మించారు. జర్నలిస్టుగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా సమాజానికి ఆయన అందించారు.

“ప్రముఖ సాహితీవేత్త, రాజకీయ, సామాజిక విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు సి. నరసింహారావు గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.” అంటూ నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement