Saturday, April 20, 2024

జిందాల్ స్టీల్ కు 860 ఎకరాలు

జిందాల్ స్టీల్ ప్లాంటుకు ఏపీ ప్రభుత్వం 860 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. గతంలో కిన్నెటా పవర్ కు కేటాయించిన భూములను రద్దు చేసి, ఆ భూములకు జిందాల్ స్టీల్ కు అప్పగించింది. నెల్లూరు జిల్లాలోని తమ్మినపట్నం-మోమిడి గ్రామాల పరిధిలో భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థలంలో రూ. 7,500 కోట్లతో 11.6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో జిందాల్ స్టీల్ ప్లాంటును నిర్మించనుంది. ఈ ప్లాంట్ ద్వారా 2,500 మందికి ప్రత్యక్షంగా, 15 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. వచ్చే నాలుగు ఏళ్లలో ప్లాంట్ విస్తరణకు వెయ్యి నుంచి 3 వేల ఎకరాల భూమి అవసరమవుతుందని జిందాల్ స్టీల్ అంచనా వేస్తోంది.

ఇది కూడా చదవండి: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది: యూబీఎస్ సర్వే

Advertisement

తాజా వార్తలు

Advertisement