Monday, April 15, 2024

Breaking: జేసీ ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్… తాడిపత్రిలో టెన్షన్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఛైర్మన్ హోదాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి జేసీ ప్రభాకర్ రెడ్డిని అధికారులు ఆహ్వానించారు. శాంతి భద్రతల దృష్ట్యా పింఛన్ పంపిణీకి రావొద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తనను హౌస్ అరెస్ట్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఛైర్మన్ హోదాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటే తప్పేముందని ఆయన ప్రశ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement