Friday, April 26, 2024

రఘువీరారెడ్డితో భేటీ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి

టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఏపీ మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని కలిశారు. తమ కలయికకు రాజకీయ ప్రయోజనం లేదన్న జేసీ ప్రభాకర్ రెడ్డి..సీమ బిడ్డలు అంతా ఏకతాటిపైకి వచ్చి జలాల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్‌ తరాల కోసం అంతా కలిసి పోరాడాలని ఆయనను కోరారు.. ఇప్పటికే పలువురు అధికారులతో పాటు సీనియర్‌ నేతలను కూడా కలిసినట్టు చెప్పారు. రాజకీయాల్లో శత్రువులు, మిత్రులు ఉంటారు.. కానీ, పోరాటాలకు కాదన్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఇక, తమ కలయికకు రాజకీయ ప్రాధాన్యం లేదన్న జేసీ.. రాయలసీమ నీటి కోసమే తాను రఘువీరా రెడ్డిని కలిశాను.. ఇప్పటికే మైసూరారెడ్డితోపాటు రాయలసీమలో చాలా మంది సీనియర్ నాయకులను, రిటైర్డ్ అధికారులను కలిశాను అని తెలిపారు. కాగా ఇప్పటికే ఎపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: ఏపీలో మాస్క్ ధరించకుంటే కఠిన చర్యలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement