ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్టును అనుకున్న లక్ష్యంగా ప్రకారం పూర్తి చేస్తామని నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. తాజాగా పోలవరం పనుల ఇసుక సరఫరా పునరుద్ధరించారు. జయప్రకాష్ పవర్ వెంచర్స్ క్షమాపణ చెప్పింది. క్షేత్రస్థాయిలో సమన్వయలోపం వలన సమస్య ఏర్పడిందని జేపీ సంస్థ పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సహకరిస్తామని వెల్లడించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement