Friday, April 26, 2024

టీడీపీ గూటికి జమ్మలమడుగు నేతలు

టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో నేడు జమ్మలమడుగు నేతలు టీడీపీలో చేరనున్నారు. మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్‍రెడ్డి టీడీపీలో చేరబోతున్నారు. మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి సోదరుడే నారాయణరెడ్డి. భూపేష్ రెడ్డికి చంద్రబాబు జమ్మలమడుగు బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది. కాగా, 2019 ఎన్నికల అనంతరం మాజీ మంత్రి ఆది నారాయణరెడ్డి టీడీపీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement