Wednesday, April 24, 2024

అశోక్‌బాబు తల్లి కోటమ్మ భౌతికకాయానికి జ‌గ‌న్ శ్ర‌ద్దాంజ‌లి…

కొండెపి – వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు తల్లి కోటమ్మ భౌతికకాయానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి తాడేప‌ల్లి నుంచి ప్రకాశం జిల్లా కారుమంచి గ్రామానికి చేరుకున్నారు. అనంత‌రం ఆయ‌న‌ అశోక్‌బాబు తల్లి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అశోక్‌బాబు కుటుంబ సభ్యులను పరామర్శించి ముఖ్యమంత్రి వారికి ధైర్యం చెప్పారు. సీఎం వెంట మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement