Saturday, April 20, 2024

నెలాఖరులో ఫ్రాన్స్‌కు వెళ్లనున్న జగన్‌..

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ నెలాఖరులో ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. వైఎస్‌ జగన్‌ పెద్ద కుమార్తె హర్షిణి రెడ్డి ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేస్తున్నారు. పారిస్‌లోని ప్రతిష్ఠాత్మక ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్లో ఆమె చదువుతున్నారు. వచ్చే నెల 2న బిజినెస్‌ స్కూల్లో కాన్వొకేషన్‌ కార్యక్రమం జరగనుంది. తన కూతురు కాన్వొకేషన్‌ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నట్లు తెలుస్తుంది.

ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత నెలలో దావోస్‌లో జరిగిన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు జగన్‌ హాజరైన విషయం విధితమే. ఇప్పుడు ఫ్రాన్స్‌కు వెళ్తున్నది వ్యక్తిగత పర్యటన. దీనికి సంబంధించి సీఎంవో నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement