Saturday, April 20, 2024

ప్ర‌జ‌ల న‌డ్డి విరుస్తోన్న జ‌గ‌న్ స‌ర్కార్.. య‌న‌మ‌ల

ధరల పెంపుతో జగన్ సర్కార్ ప్రజల నడ్డి విరుస్తోందని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల రామ‌కృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… విద్యుత్ ఛార్జీలు పెంచి పేదలను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా వాహనాల పన్ను పెంపుతో ప్రజలపై ప్రతి సంవత్సరం రూ.250 కోట్ల భారం పడుతుందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఆరు నెలల్లో రూ.2,131 కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేసిందని విమర్శించారు.డీజిల్, పెట్రోల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఏపీలో ఉన్నాయని మండిపడ్డారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement