Thursday, April 25, 2024

ఉన్న‌త విద్యా శాఖ‌లో ఖాళీలు భ‌ర్తీ చేయండి- జ‌గ‌న్ ఆదేశం

అమరావతి, ఆంధ్రప్రభ: ఉన్నత విద్యాశాఖలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాలని ఆదేశాలిచ్చామని, జూన్‌ నాటికి వీటి నియామక ప్రక్రియ ప్రారంభం కావాలని సిఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. క్యాంప్‌ కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఖాళీలను భర్తీ చేయడంలో అడ్డంకిగా ఉన్న కోర్టు కేసులన్నింటినీ తొలగించుకోని జూన్‌ నాటికి నియామక ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు చేపడుతు న్నామని, ఈ నేపథ్యంలో సిబ్బంది నియామాకం కూడా త్వరగతిన భర్తీ చేయాలని ఆదేశించారు. డిగ్రీ చదువుతున్నవారి నైపుణ్యాలను బాగా పెంచాలన్నా రు. వివిధ కోర్సులను పాఠ్యప్రణాళికలో ఇంటిగ్రేట్‌ చేయాలని, విదేశాల్లో విద్యార్థులకు అందిస్తున్న వివిధ కోర్సులను పరిశీలించి వాటిని కూడా ఇక్కడ విద్యార్థులకు అందుబాటు-లోకి తీసుకురావాలని అన్నారు. జాబ్‌ ఓరియెం-టె-డ్‌ కరిక్యులమ్‌ ఉండా లని, సర్టిఫైడ్‌ ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ కరిక్యులమ్‌లో భాగం కావాలని, ఈ తరహా కోర్సుల వలన డిగ్రీ పూర్తయ్యేనాటికి స్వయం ఉపాధి అందుతుందని చెప్పారు. ప్రఖ్యాత కాలేజీల కరిక్యులమ్‌ చూసి, వాటిని మన దగ్గర అమలయ్యేలా చూడాలని, స్వయం ఉపాధిని కల్పించే నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ వంటి సంస్ధలతో ఈ కోర్సుల
కోసం -టైఅప్‌ చేసుకోవాలని,రిస్క్‌ ఎనాలసిస్‌, బ్యాంకింగ్‌, రిస్క్‌ మేనేజిమెంట్‌, రియల్‌ ఎస్టేట్‌ వంటి కోర్సులపై దృష్టి పెట్టాలని అన్నారు. వచ్చే జూన్‌ కల్లా పాఠ్యప్రణాళికలో ఈ కోర్సులు భాగం కావాలన్నారు.

కళాశాలల్లో కోర్సులన్నీ ఇవాల్టి అవసరాలకు తగిన విధం గా రూపొందించాలని,కళాశాలలకు అనుమతుల విష యంలో కూడా ఒకే విధానం ఉండాలని, వివిధ కోర్సులకు సంబంధించిన కరిక్యులమ్‌ అందించే బాధ్యత స్కిల్‌ యూ నివర్సిటీ- తీసుకోవాలని అన్నారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 స్కిల్‌ సెంటర్లు ఏర్పాటు- చేస్తున్నామని, ఆయా జిల్లాల్లో అందుబాటు-లో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులు ఏర్పాటు- చేయాలని,హై ఎండ్‌ స్కిల్స్‌లో భాగంగా.. సాప్ట్‌వేర్‌ స్కిల్స్‌ను కూడా అభివృద్ధి చేయాలని ఆదేశిం చారు.కోడింగ్‌, క్లౌడ్‌ సర్వీసెస్‌లాంటి డిమాండ్‌ ఉన్న కోర్సు లపై దృష్టి పెట్టాలని, విద్యార్ధులకు సర్టిఫికేషన్‌ఉంటేనే ఎంప్లాయిమెంట్‌ పెరుగుతుందని,ఐటీ-, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలు కలిపి కరిక్యులమ్‌ రూపొందించాలని ఆదేశించారు. సోలార్‌ పార్క్‌లు, సోలార్‌ మోటార్లు, ప్యానెల్స్‌ రిపేరు వంటి వాటిలో నైపుణ్యం కొరత చాలా ఎక్కువగా ఉందని,ప్రతి నియోజకవర్గంలో ఇవి అందుబాటు-లో ఉండాలని,ఈ మేరకు కోర్సులు, కరిక్యులమ్‌, శిక్షణ ఉండాలని,వచ్చే జూన్‌ లక్ష్యంగా ఈ తరహా కోర్సులు ఏర్పాటు- చేయాలని సిఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ప్రతి కాలేజీలో కూడా బోధనపరంగా, వసతులు పరంగా నాణ్యత పెరగాలని, ప్రతి విద్యాసంస్థ కూడా నాక్‌ అక్రిడిటేషన్‌ సాధించాలని, మూడేళ్లలో కాలేజీల ప్రమాణాలు పెంచుకు నేలా వారికి చేయూత నివ్వా లని అన్నారు. ఒక్కో ఏడాది ఒక్కో లక్ష్యాన్ని అందు కుంటూ మూడేళ్లలో ప్రమాణాలు పెంచు కోవా లన్నారు.

మూడేళ్ల తర్వాత కచ్చితంగా ఉన్నత విద్యాశా ఖలోని విద్యాసంస్థలు నాక్‌ అక్రిడిటేషన్‌ సాధించా లన్నారు. అలా సాధించలేని పక్షంలో సంబంధిత కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని,అప్పుడే విద్యార్ధులకు నాణ్య మైన విద్య అందుతుందని పేర్కొన్నారు. ప్రయివేట్‌ బిఇడీ కాలేజీలు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని చర్చకు రాగా అటువంటి కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ముఖ్య మంత్రి ఆదేశించారు. బోధన సిబ్బంది సామర్థ్యాన్ని మెరుగు పరచ డానికి తిరుపతి, విశాఖపట్నంలో ఉన్న అకడమిక్‌ స్టాఫ్‌ కాలేజీని బలోపేతం చేయడం సహా సెంట్రల్‌ ఆంధ్రా పరిధి లో ఒక చోట అకడమిక్‌ స్టాఫ్‌ కాలేజీ ఏర్పాటు- చేయాలని సిఎం ఆదేశించారు. యూనివర్శిటీ-ల్లో రిక్రూట్‌మెంట్‌కు సంబం ధించి ప్రత్యేక బోర్డును ఏర్పాటు- చేయడంపై ఆలోచన చేయా లని,సమర్థులైన బోధనా సిబ్బందిని నియమించేందు కు, తద్వారా బోధనా ప్రమాణాలను విశ్వవిద్యాలయాల్లో పెంచేం దుకు అధికారులు చర్యలు తీసుకోవాలని , ట్రిపుల్‌ ఐటీ-లలో సిబ్బంది నియామకం, ఇతర పెండింగ్‌ అంశాలను సత్వరమే పరిష్కరించాలని సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌ రెడ్డి, విద్యా శాఖ సలహాదారు ఏ సాంబశివారెడ్డి, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు, ఆర్‌జీయూకేటీ- ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కే సి రెడ్డి, కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్క ర్‌, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె హేమ చంద్రారెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement