Wednesday, April 24, 2024

ఇక‌పై రోడ్లు బాగు బాగు..

అమరావతి, ఆంధ్రప్రభ : ఉన్న రోడ్లను పూర్తిగా బాగు చేయడంతోపాటు కొత్తగా వేస్తున్న రోడ్లను నాణ్యతతో వేయా లని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ఆర్‌ అండ్‌ బీ శాఖపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్‌, పురపాలక, గిరిజన సంక్షేమశాఖల అధికా రులతోనూ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత మరలా రెండేళ్లకే రిపేర్లకు వచ్చే అవకాశం ఉండకూడదని స్పష్టంచేశారు. రోడ్డు వేశాక కనీసం ఏడేళ్లపాటు- పాడవ్వకుండా ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. దీనివల్ల క్రమం తప్పకుండా రోడ్లు మెయిం-టె-నెన్స్‌ అవుతాయని, నిర్వహణ కూడా సజా వుగా, నాణ్యతతో సాగుతుందని తెలిపారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అందులో ప్రధానమైన రోడ్లన్నిం టినీ కూడా పూర్తిచేయాలని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లా లతో పాటు- కృష్ణా, గుంటూరు వంటి జిల్లాల్లో నేల స్వభావం రీత్యా రోడ్లు త్వరగా పాడైపోతున్నాయని, భారీ వాహనాలు తిరిగే సరికి కుంగిపోతున్నాయని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి చోట్ల పుల్‌ డెప్త్‌ రిక్లమేషన్‌ (ఎఫ్‌డీఆర్‌) -టె-క్నాలజీని వాడాలని అధికారులు ప్రతిపాదించగా అందుకు సీఎం జగన్‌గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఖర్చు ఎక్కువైనా నాణ్యత బాగుంటు-ందని ఆయన వెల్లడించారు. మొదటి దశలో వేయి కిలోమీటర్ల మేర ఎఫ్‌డీఆర్‌ -టె-క్నాలజీతో చేపట్టాలని సూచించారు. వచ్చే జూన్‌, జులైకల్లా ఈ పద్ధతిలో నిర్దేశించుకున్న మేరకు రోడ్లు వేయాలని చెప్పారు. ఈక్రమంలోనే అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలను కూడా పూర్తిచేయాలన్నారు.

వీటిపైనా దృష్టిపెట్టాలి
కడప, బెంగళూరు రైల్వే లైనుపైన, విశాఖ నుంచి భోగాపురానికి వెళ్లే రోడ్డు నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని చెప్పారు. రోడ్లు బాగు చేసిన తర్వాత నాడు – నేడు ద్వారా ప్రజల ముందు పెట్టాలని తెలిపారు. ఇంత ఖర్చుచేసి రోడ్లు బాగుచేస్తున్నా నెగిటివ్‌ ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అన్ని ప్రభుత్వ శాఖలో నాడు- నేడు శీర్షిక కింద మనం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచాలని చెప్పారు. ఆయా ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లలో కూడా ఈ వివరాలు ఉంచాలని పేర్కొన్నారు. దురుద్దేశంతో కొన్ని మీడియా సంస్థలు నెగెటివ్‌ ప్రచారం చేస్తున్నాయని, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా విష ప్రచారం చేస్తున్నాయని అసహనం వ్యక్తంచేశారు. వారి కడుపుమంటకు మందులేదన్న ఆయన అందుకే మనం చేస్తున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచడమే ఏకైక మార్గమని చెప్పారు.

పట్టణాలు, నగరాల్లో ఎప్పటికప్పుడు రిపేర్లు :
పట్టణాలు, నగరాల్లో ఎప్పటికప్పుడు రోడ్ల రిపేర్లను చేసేందుకు ఉద్దేశించిన ఏపీసీఎం ఎంఎస్‌ యాప్‌ను ఈసమావేశంలో సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ యాప్‌ ద్వారా రోడ్ల పరిస్థితిపై స్థానిక ప్రజా ప్రతినిధులు, పౌరులు ఎవరైనా ఫిర్యాదు చేసే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈయాప్‌ ద్వారా దీనికి సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్‌ చేసే అవకాశం ఉంటుందన్నారు. జియో కోఆర్డినేట్స్‌తో పాటు గా ఫిర్యాదు నమోదవుతుందని చెప్పారు. దీనిపై కమాండ్‌ కంట్రోల్‌ రూం కూడా ఏర్పాటు-చేసి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

నాణ్యతతో మరమ్మతులు :
పట్టణాలు, నగరాల్లో రోడ్ల మరమ్మతులు నాణ్యతతో జరగాలన్నారు. పట్టణాలు, నగరాల్లో ఎక్కడైనా ఫలానా చోట రోడ్డు రిపేరు చేయాలని పౌరుడు ఫిర్యాదుచేసిన 60 రోజుల్లో దాన్ని బాగు చేయాలని నిర్దేశించామని, ఈ లక్ష్యాన్ని తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. యాప్‌ పనితీరు, అందులో వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంపై నిరంతరం సమీక్ష, పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు. నాణ్యత మీద ప్రత్యేక దృష్టిపెట్టినప్పుడు అవే సమస్యలు ప్రతిసారి రావన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. అందుకే రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కోరారు. రిపేర్‌ చేయడమే కాకుండా, వాటి నాణ్యతమీద కూడా ప్రత్యేక ధ్యాస పెట్టాలన్నారు. ఇకపైన కూడా రోడ్ల నిర్వహణలో గణనీయమైన మార్పులు రావాలని, రోడ్డు మరమ్మతులలో దీర్ఘకాలం నిలిచే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించు కోవాలని చెప్పారు.

ఈసమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధిశా) బూడి ముత్యాలనాయుడు, ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశా) పీడిక రాజన్న దొర, ఆర్‌ అండ్‌ బీ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా), పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ కార్యదర్శి కే వీవీ సత్యనా రాయణ, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, రవాణాశాఖ కార్యదర్శి పీ ఎస్‌ ప్రద్యుమ్న, మున్సిపల్‌ అడ్మిని స్ట్రేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement