Wednesday, April 24, 2024

రేపు క‌డ‌ప జిల్లాలో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రేపు క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌న‌ మూడు రోజుల పాటు పర్యటించ‌నున్నారు. రేపు ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో… గ‌న్న‌వ‌రం నుంచి ప్రొద్దుటూరు వెళ్ల‌నున్న సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌లు అభివృద్ధి పనుల‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ఇక రేపు సాయంత్రం ఇడుపులపాయ ఎస్టేట్ లో సీఎం జ‌గ‌న్‌ బ‌స చేయ‌నున్నారు. 24వ తేదీన ఇడుపుల పాయ‌లో దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి.. స‌మాధి వ‌ద్ద నివాళుల‌ర్పించనున్నారు. అనంత‌రం ఆదిత్య బిర్లా యూనిట్ కు శంకుస్థాప‌న చేస్తారు. 25వ తేదీన ఉద‌యం పులివెందుల సీఎస్ ఐ చ‌ర్చిలో క్రిస్మ‌స్ వేడుక‌ల్లో పాల్గొన‌నున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement