Thursday, April 25, 2024

పుంగనూరులో బస్‌ డిపోను ప్రారంభించిన జ‌గ‌న్

అమ‌రావతి – చిత్తూరు జిల్లా పుంగనూరులో బస్‌ డిపో, వైయస్‌ఆర్‌ జిల్లా కడపలో డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఏరియా ఆస్పత్రి ప్రారంభించడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ కూడా మానవత్వంతో ముందుకొచ్చి ఆస్పత్రిని ఏర్పాటు చేయడం మంచిపరిణామం అన్నారు. కడపలో ఏరియా ఆస్పత్రిని, పుంగనూరులో ఆర్టీసీ బస్‌ డిపోను జగన్ తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.7.5 కోట్లతో పుంగనూరు ఆర్టీసీ డిపో, రూ.5.8 కోట్లతో కడపలో ఏరియా ఆస్పత్రిని నిర్మించారు. ఈ సందర్భంగా కడప బ‌స్టాండ్‌కు డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి బస్‌స్టేషన్‌గా నామకరణం చేశారు. అనంతరం జగన్‌ మాట్లాడుతూ.. ‘పాదయాత్రలో పుంగనూరుకు వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ డిపోను ప్రారంభించడం దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం’ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement