Saturday, April 20, 2024

సమయం ఇవ్వండి.. సీబీఐ కోర్టును కోరిన జగన్

అక్ర‌మాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన  పిటిషన్‌పై హైదరాబాద్  సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ సమయం కోరారు.  తదుపరి విచారణ ఈ నెల 17కి వాయిదా పడింది. ఆలోపు కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని కోర్టు ఆదేశించింది.

కాగా, అక్ర‌మాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ ను హైద‌రాబాద్‌ నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించిన విష‌యం తెలిసిందే. కేసులో జగన్‌ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, బెయిల్‌ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని ఆయ‌న వేసిన పిటిష‌న్‌పై నేడు విచార‌ణ జ‌రిగింది. సీఎం జగన్ బెయిల్ రద్దుపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. సీబీఐ విచారణ చేపట్టినప్పుడల్లా వైసీపీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement