Thursday, March 28, 2024

తాను బ‌తికి ఉండ‌గా… పోలవరం పూర్తవడం అసాధ్యం : ఉండ‌వ‌ల్లి

తాను బతికి ఉండగా పోలవరం పూర్తవడం అసాధ్యమని ఏపీ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పోలవరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ… రాజశేఖర్‌రెడ్డి హాయంలో శంకుస్థాపన చేయగా.. ఇప్పటికీ పది సంవత్సరాలు పూర్తికావస్తున్నా.. ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి కారకులెవరని ప్రశ్నించారు. ఇటీవల వచ్చిన వరదల్లో పోలవరం డయాఫ్రం వాల్‌ దెబ్బతినడానికి కారణం ఎవరని, ఈ విషయంలో ఎవరిపై చర్యలు తీసుకుంటున్నారని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను తక్షణమే ఆదుకోవాలని వైసీపీ ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ ప్రభుత్వం పోలవరం నిర్మాణ పనులపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement