Saturday, March 23, 2024

ISRO – జి ఎస్ ఎల్ వి ఎఫ్ 12 రాకెట్ ప్రయోగం … ఎన్‌వీఎస్‌-1 శాటిలైట్ విజయవంతంగా కక్షలోకి …LIVE

భారత అంతరక్ష పరిశోధనా సంస్థ జి ఎస్ ఎల్ వి 12 రాకెట్ ను నేడు నింగిలోకి పంపంది.. దీని ద్వారా . నావిగేషన్‌ శాటిలైట్‌ ఎన్‌వీఎస్‌-1ను నింగిలోకి చేర్చింది.. సరిగా 19 నిమిషాలలో ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నావిగేషన్‌ సర్వీసెస్‌ కోసం పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహాల్లో నాలుగింటి జీవిత కాలం ముగిసింది. ఆ సిరీస్‌లో భాగంగానే ఈ ఎన్‌వీఎస్‌ ఉపగ్రహాన్ని పంపేంది. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్ (NavIC) పేరుతో ఇస్రో అభివృద్ధి చేసిన ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఇది. కక్ష్యలో ఉన్న ఏడు ఉపగ్రహాల సమూహం కాగా.. ఇది గ్రౌండ్ స్టేషన్‌లతో కలిసి పని చేయనుంది.

ఇక.. నెట్‌వర్క్ సాధారణ వినియోగదారులు, వ్యూహాత్మక వినియోగదారులకు నావిగేషనల్ సేవలను కూడా ఈ శాటిలైట్​ అందిస్తుంది. సాయుధ దళాలు, మెరుగైన పొజిషనింగ్, నావిగేషన్ అండ్‌ టైమింగ్ కోసం దేశంలో పౌర విమానయాన రంగానికి పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థను ఇస్రో అభివృద్ధి చేసింది. రెండో తరం నావిగేషన్ శాటిలైట్ సిరీస్‌లో NVS-1 ఇది మొదటిదని ఇస్రో తెలిపింది. ఇది లెగసీ NavIC సేవల కొనసాగింపును నిర్ధారిస్తుందని, Li బ్యాండ్‌లో కొత్త సేవలను అందించనున్నట్టు ఇస్రో అధికారులు వెల్లడించారు.

ఈ శాటిలైట్‌ను సోమవారం శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని రెండో ప్యాడ్‌ నుంచి నింగిలోకి పంపారు.. ప్రస్తుతం స్థిరంగా అది నిర్ణీత కక్షలోకి దూసుకువెళుతున్నది. దీన్ని జీఎస్‌ఎల్‌వీ మోసుకెళ్లనున్నది. సోమవారం ఉదయం 10.42 గంటలకు ప్రయోగం చేపట్టనుండగా.. ఆదివారం ఉదయం 7గంటల 12నిమిషాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. 27గంటల 30 నిమిషాల పాటు నిరంతరాయంగా కౌంట్‌డౌన్ కొనసాగిని అనంతరం నేటి ఉదయం సరిగ్గా 10.30 కి నింగిలోకి ప్రయోగించారు.. 19 నిమిషాల అనంతరం దీని ద్వారా 2,232 కిలోల ఎన్‌వీఎస్‌–01 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement